ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

74చూసినవారు
ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. పార్లమెంటరీ పార్టీ నేతను సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉంది. ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి 16 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తే అంశాలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్