అనంతపురం జిల్లా కుందుర్పిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి ఇద్దరు మృతి చెందారు. కుందుర్పిలోని జిల్లా పరిషత్ పాఠశాల వద్ద బహిర్భూమికి వెళ్లిన బాలుడు నీటికుంటలో పడ్డాడు. బాలుడిని కాపాడేందుకు వెళ్లిన యువకుడు కూడా నీటికుంటలోకి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.