త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు వైసీపీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకుంటున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వారికి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్నాయన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని లేఖలో కోరారు.