ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీని బదిలీ చేయండి: అచ్చెన్న

77చూసినవారు
ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీని బదిలీ చేయండి: అచ్చెన్న
త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు వైసీపీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున స్టాక్‌ పెట్టుకుంటున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వారికి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌, ఎక్సైజ్‌ శాఖ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్నాయన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని లేఖలో కోరారు.

సంబంధిత పోస్ట్