ఏపీలో 2024 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ బరిలో దిగనుంది. సమాజ్ వాదీ పార్టీ ట్రాన్స్జెండర్ నాయకులు సూరాడ యల్లాజీని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించుతోందని ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు జాలాది విజయ తెలిపారు. అర్ధనారీశ్వర స్వరూపులైన ట్రాన్స్జెండర్స్ అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న తరుణంలో వాళ్ల వాణి అసెంబ్లీలో కూడా వినిపించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.