రెండో విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి రెండో దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది. ఇక 12 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాల్లో ఏప్రిల్ 26న రెండోదశ పోలింగ్ జరుగుతుందని ఈసీ పేర్కొంది. ఏప్రిల్ నాలుగో తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.