అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

79చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గరివిడి మండలం ఎం. దుగ్గివలస గ్రామానికి చెందిన దాసరి సత్యం (38) భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బయటకు వెళ్లి చీపురుపల్లి వద్ద కింద పడి ఉన్నాడు. ఈ విషయాన్ని రమణ అనే వ్యక్తి సత్యం కుటుంబీకులకు తెలపగా వారు వెంటనే అక్కడికి వచ్చి ఆపస్మారక స్థితిలో ఉన్న అతన్ని విజయనగరం లోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి చికిత్స పొందుతూ మరణించినట్లు తల్లి తెలియజేసారని ఎస్సై కె. కె నాయుడు శుక్రవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్