
గుర్ల: స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
గుర్ల మండల కేంద్రంలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు. స్థానిక ఎంపీపీ పాఠశాలలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర సభలో పాల్గొని హీట్ ద బీట్ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన గుర్ల జంక్షన్ లో చలివేంద్రాన్ని ప్రారంభించారు.