వాలంటీర్ల ద్వారా పింఛను పంపిణీని అడ్డుకోవడం దారుణం

1068చూసినవారు
వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ నిలుపుదలకు ఎన్నికల కమిషన్ కి నిమ్మగడ్డ ద్వారా ఫిర్యాదు చేయించడం దారుణమని వైసిపి నాయకులు రేగాన శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడారు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛను ఇచ్చేవారని ఇప్పుడు పింఛను తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడతారని చెప్పారు. రాష్ట్రంలో 66 లక్షలు మంది పింఛనుదారులు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్