ఆక్రమణలను అడ్డుకున్న ఆయికట్టుదారులు

66చూసినవారు
ఎస్ కోట కెనరా బ్యాంకు వెనుక 462 సర్వే నెంబర్లో గల రాజుల చెరువును కొంతమంది ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారనే సమాచారం అందుకున్న ఆయికట్టుదారులు శుక్రవారం సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. జేసిబి తో చదును చేస్తున్న పనులను అడ్డగించారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో కిరణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు చేపడతానని ఎమ్మార్వో హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్