రైలు పట్టాలపై ఆగిన లారీతో అగచాట్లు

4005చూసినవారు
గజపతినగరంలోని మెంటాడ రోడ్ లో గల రైల్వే గేటు పట్టాలపై భారీ లోడు గల లారీ శుక్రవారం తెల్లవారుజామున 4: 30కు ఆగిపోయింది. దీంతో గజపతినగరం నుంచి వెంటాడ వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది. అలాగే రైళ్లు రాకపోకలకు గంటల కొద్ది అంతరాయం ఏర్పడింది. నాలుగు జెసిబిలు వచ్చి ఆగిన లారీని ఆరున్నర గంటల సమయంలో పోలీసులు పర్యవేక్షణలో తొలగించడంతో రాకపోకలను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్