గజపతినగరం మండలం కాలంరాజుపేట గ్రామంలోని సచివాలయంలో సోమవారం 13 వంతుల కాలువ నీటి సంఘం ఓటర్ల జాబితాను ఆ గ్రామ సర్పంచ్ గేదల ఈశ్వరరావు విడుదల చేశారు. నీటి సంఘం ఎన్నికలు ఈనెల 21వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఈ జాబితాను విడుదల చేశారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి మాధవి పాల్గొన్నారు.