ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన: మంత్రి కొండ‌ప‌ల్లి

85చూసినవారు
పేద‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఒక రోజు ముందే పింఛ‌న్లను పంపిణీ చేస్తున్న‌ట్లు మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ చెప్పారు. బొండ‌ప‌ల్లి మండ‌లం జియ్య‌న్న‌వ‌ల‌స‌ గ్రామంలో శ‌నివారం మంత్రి పింఛ‌న్ల‌ను పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి ల‌బ్దిదారుల‌కు పింఛ‌న్లు అందజేశారు. కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుడు చుక్క అప్పారావు పురి పాక‌లోనికి వెళ్లి మ‌రీ పింఛ‌న్ అందించారు.

సంబంధిత పోస్ట్