వాహన తనిఖీలలో భాగంగా బొండపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఎటువంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న 1, 65, 000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని బొండపల్లి ఎస్. ఐ కె. లక్ష్మణరావు బుధవారం రాత్రి విలేకరులకు తెలిపారు. సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా గజపతినగరం నుంచి విజయనగరం వైపు కారులో రవ్వ సుజిత్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నగదు తీసుకు వెళుతుండగా పట్టుకున్నామని తెలిపారు.