మాజీ మంత్రి పడాల అరుణను పరామర్శించిన ఎస్ కోట జనసేన నాయకులు

83చూసినవారు
మాజీ మంత్రి పడాల అరుణను పరామర్శించిన ఎస్ కోట జనసేన నాయకులు
గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పడాల అరుణ కుమారుడు శరత్ అనారోగ్య కారణాలతో ఆదివారం మృతి చెందడం తెలిసిందే. ఈ మేరకు ఎస్. కోట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఒబ్బిన సన్యాసినాయుడు సోమవారం పడాల అరుణను పరామర్శించారు. ఈ మేరకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఓదార్చారు. శరత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్