రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఆందోళన

72చూసినవారు
జియ్యమ్మవలస మండలం, పెదమేరంగి జంక్షన్ లో ప్రధాన రహదారిపై ఏర్పడిన గోతులను వెంటనే పూడ్చాలని, రోడ్డు పనులను యుద్ధ పాతిపదికన చేపట్టాలని శుక్రవారం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి జీవన్న డిమాండ్ చేశారు. గుంతలు వద్ద నిలిచిన వర్షపు నీటి వద్ద నిరసన తెలిపారు. మూడు అడుగుల లోతుల్లో నీరు నిల్వ ఉంటుందని దాంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు రోడ్డు పనులు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్