కురుపాం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శల అస్త్రాలు సంధించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గిరిజనులకు, గిరిజన ప్రాంతాల్లో ఏమి చేశాడంటూ ఆయన ప్రశ్నించారు. కురుపాం, సాలూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నానని చర్చకు ఎవరైనా ముందుకు రావచ్చని టిడిపి నేతలకు సవాల్ విసిరారు.