హామీలు అమలు చేయలేక లడ్డూపై రాజకీయం

65చూసినవారు
హామీలు అమలు చేయలేక లడ్డూపై రాజకీయం
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక తిరుపతి లడ్డూపై రాజకీయం చేస్తూ మత విధ్వంసాలు సృష్టిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఆరోపించారు. చంద్రబాబు మనస్సు మారి ప్రజలకు మంచి చేయాలని కోరు తూ శనివారం కురుపాం మండలం కస్పాగదబవలస శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఎంపీపీ శెట్టి పద్మావతి, జడ్పీటీసీ గొర్లి సుజాత, సర్పంచ్‌ సుజాత తదితరు లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్