జగన్నాథ స్వామి ఆలయం ఆవరణలో బహిరంగ వేలం

64చూసినవారు
జగన్నాథ స్వామి ఆలయం ఆవరణలో బహిరంగ వేలం
పాలకొండ పట్టణంలోని స్థానిక శ్రీ జగన్నాథ స్వామివారి యాత్రను జూలై 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ కాళీ ప్రదేశంలో ఎగ్జిబిషన్ పెట్టుటకు బుధవారం ఆలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో 10 మంది పాల్గొనగా. షేక్ అబ్దుల్లా ఇమ్రాన్ ఖాన్ రూ. 4, 20, 000లకు ఎగ్జిబిషన్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ఆలయ ఈవో కే. సర్వేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్