ఐదు సంవత్సరంలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా బగాది జగన్నాథ రావు తెలిపారు. శనివారం డి. ఎం. అండ్ హెచ్. ఒ. కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో కార్యక్రమ వివరాలు తెలియజేసారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయుటకు ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందన్నారు. మార్చి 3వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.