రాయితీపై రైతులకు వరి విత్తనాలు పంపిణీ

53చూసినవారు
రాయితీపై రైతులకు వరి విత్తనాలు పంపిణీ
వేపాడ మండలం రామస్వామి పేటలో స్థానిక సచివాలయం వద్ద వి ఏ ఏ శివ ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై వరి విత్తనాలను మండల వైసిపి అధ్యక్షులు జగ్గుబాబు చేతుల మీదగా బుధవారం అందజేశారు. వర్షాలు సమీపిస్తున్న వేళ రైతులు ఖరీఫ్ పంటలకు సమాయత్తం కావాలని కోరారు. ప్రతి రైతుకు రాయితీపై సకాలంలో వరి విత్తనాలను అందజేయాలని జగ్గుబాబు కోరారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్