గోస్తనీ నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు

63చూసినవారు
జామికి చెందిన కొత్తలి దేవుడు ఆదివారం గోస్తనీ నది తీరంలో పశువుల మేపుతూ వెళ్లి నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం తహసీల్దార్, ఎస్. కోట అగ్నిమాపక అధికారి షేక్ మదీనా ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నది ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గాలింపు చర్యలకు ఆటంకం కలిగినట్లు అధికారులు తెలిపారు. ఏపీ ఎస్ ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలకు సమాచారం అందించామని, వారితో గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్