బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కోళ్ల

73చూసినవారు
ఎల్ కోట మండలం రంగరాయపురంలో గల బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి బుధవారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆమె పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మౌలిక సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కరెడ్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్