ఎస్.కోట: ఘనంగా ప్రారంభమైన గౌరీ పౌర్ణమి పండగ మహోత్సవాలు

61చూసినవారు
ఎస్.కోట: ఘనంగా ప్రారంభమైన గౌరీ పౌర్ణమి పండగ మహోత్సవాలు
ఎస్ కోట మండలంలో మహిళల పండగైన గౌరీ పౌర్ణమి పండగ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వినాయక పల్లిలో గల మహిళలు బుధవారం గౌరీ పరమేశ్వరులను తమ గ్రామంలో ప్రతిష్టించి గౌరీ పౌర్ణమి పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది తమ గ్రామంలో గౌరీ పౌర్ణమి వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని పలువురు మహిళలు తెలిపారు. వచ్చే కార్తీక పౌర్ణమి వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్