కొత్తవలసలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా

5788చూసినవారు
కొత్తవలసలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా
కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో గల సచివాలయం-3 పరిధిలో పనిచేస్తున్న 27 మంది వాలంటీర్లు సోమవారం మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాజీనామా లేఖలను పంచాయతీ సెక్రటరీ దుర్గాభవానికు సమర్పించారు. తమకు ఎటువంటి అధికారాలు లేనప్పుడు రాజీనామాలే శరణ్యమని వాలంటీర్లు తెలిపారు. తమ వద్ద నుండి అధికారులు ఫోన్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్