మాజీ సీఎంలపై విజయసాయి రెడ్డి ఫైర్

59చూసినవారు
మాజీ సీఎంలపై విజయసాయి రెడ్డి ఫైర్
మాజీ సీఎంలు నారా చంద్రబాబు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శనివారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ.. రాష్ట్ర విభజనకు సహకరించారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు సహకరించిన వీళ్లు ఇప్పుడు బీజేపీలో చేరడం సిగ్గుచేటు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్