దళితులని చంపి డోర్ డెలివరీ చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి రెచ్చిపోయాడు. దేవీపట్నం మండలం అగ్రహారం ఆర్ అండ్ ఆర్ గ్రామానికి ప్రచారానికై వెళ్ళగా అక్కడ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలోనే మేము గుర్తొచ్చామా అని నిలదీశారు. ఆయన గ్రామస్తుల గోడు పట్టించుకోకుండా ఇది ప్రతిపక్షాల కుట్ర, టీడీపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువ మాట్లాడితే ఒప్పుకోము అంటూ మాట్లాడాడు. ప్రజలు మాత్రం అతని మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.