వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలు ఆదరించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కయ్యపాలెం నరసింహ నగర్ రైతు బజార్ ను ఆదివారం ఆయన సందర్శించారు. పలువురు చిరు వ్యాపారులతో పాటుగా వినియోగదారులతో కొంతసేపు ముచ్చటించారు. చిరు వ్యాపారస్తులను ప్రోత్సహిస్తూ కొబ్బరికాయలు విక్రయించారు.