అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని తురకలపూడి ప్రభుత్వ ఆసుపత్రి నందు జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవ సందర్భంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు తప్పకుండా కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.