షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ధర్నా

54చూసినవారు
షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ధర్నా
బుచ్చయ్యపేట మండలం రాజం విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేసిన ఆర్. భీమవరంకి చెందిన రొంగలినర్సింగరావు అనారోగ్యంతో మృతి చెందారు. సుమారు తొమ్మిదేళ్లపాటు ఇక్కడ ఆయన విధులు నిర్వహించారు. ఇటీవల ఈపోస్టుకి స్థానికేతరుడైన దొండపూడికి చెందిన వ్యక్తిని ఎంపిక చేశారు. తమను కాదని వేరే వ్యక్తిని ఎంపిక చేయడంపై నర్సింగరావు భార్య రామలక్ష్మి సబ్ స్టేషన్ వద్ద గురువారం ధర్నా చేశారు. ఆమెకు గ్రామస్తులు అండగా నిలిచారు.

సంబంధిత పోస్ట్