గురుకుల పాఠశాలలోకి ప్రవేశించిన వరద నీరు

50చూసినవారు
భారీ వర్షాల కారణంగా గొలుగొండ బి. ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలోకి ఆదివారం వరదనీరు ప్రవేశించింది. దీంతో విద్యార్థులు పలు అవస్థలు పడుతున్నారు. చుట్టూ వరదనీరు చేరడంతో గురుకుల పాఠశాల ప్రాంగణం చెరువును తలపిస్తుంది. తాండవ రిజర్వాయర్ ను అనుకుని పాఠశాల ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్