బి.కే పల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

330చూసినవారు
బి.కే పల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్ల మండలం బి. కే పల్లి గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 374 మందికి పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, సెక్రెటరీ, గ్రామ వాలంటీర్స్, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్