24 గంటల పాటు శిథిలాల కింద బాధితుడు.. కాపాడిన NDRF (వీడియో)

61చూసినవారు
యూపీలోని లక్నో సిటీ ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో ఓ బిల్డింగ్ శనివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం NDRF, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ పనులు కొనసాగించారు. ఈ క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని ఆదివారం వారు కాపాడారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్