అనకాపల్లిలో శతాధిక కవి సమ్మేళనం

63చూసినవారు
అనకాపల్లిలో శతాధిక కవి సమ్మేళనం
శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అనకాపల్లిలో ఆదివారం శతాధిక కవి సమ్మేళనం జరిగింది. గవరపాలెం లోని గౌరీ గ్రంధాలయంలో 139వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో 160 మంది కవులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఎందరో కవులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కవితలు వినిపించారు. అనంతరం వేదిక మీద కవులను సత్కరించారు. శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కే. ప్రతాప్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా తెలుగుభాష సాహిత్యం కోసం కృషి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్