విద్యార్ధులకు పోటీలు

79చూసినవారు
విద్యార్ధులకు పోటీలు
సెప్టెంబర్ 24 ఎన్ఎస్ఎస్ దినోత్సవం పురష్కరించుకొని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా కెబికె నాయక్ ఆదేశాల మేరకు విద్యార్థులకు శనివారం ఉదయం 5కి. మీ పరుగుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పిడి అప్పారావు, కోచ్ జయప్రకాష్ నారాయణ పర్యవేక్షించారు. ఈ పోటీలో 43 మంది అబ్బాయిలు, 13 మంది అమ్మాయిలు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు ఎన్ఎస్ఎస్ దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్