దేశీయ విత్తనాలతో కూరగాయలు పండిద్దామని ఎయు సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ హర్నాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ఆధ్వర్యంలో మన కూరగాయల తోట కార్యక్రమంలో భాగంగా కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు విద్యార్థులు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం చేయడం ఆరోగ్యకరమన్నారు.