వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని సిఎం జగన్ స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు. మంగళవారం సీఎం విశాఖలో పర్యటించారు. 'విజన్ విశాఖ' పేరుతో వైజాగ్ ఏర్పాటు చేసిన ఏపీ డెవలెప్మెంట్ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని దాని ప్రభావం ఏపీపై ఉందని అన్నారు.