టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత

2906చూసినవారు
విశాఖ అగనంపూడి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం రాత్రి స్థానిక ప్రజలు టోల్ గేట్ వసూళ్లను నిలిపి వేయించారు. కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. టోల్ ప్లాజాను ఎత్తివేయాలని కాలనీవాసులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. టోల్ గేట్ కి ఇచ్చిన సమయం పూర్తయినప్పటికీ అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. టోల్ గేట్ ఎత్తివేయాలని నిరసన తెలుపుతూ వాహనదారులను రుసుం కట్టనివ్వకుండా పంపించేశారు.

సంబంధిత పోస్ట్