బీఎస్పీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

561చూసినవారు
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్ధి బొట్టా నాగరాజు నాతవరం మండలం మండలం గొలుగొండపేట, జగ్గంపేట, పీకే. గూడెం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటర్లతో మాట్లాడారు. ఇప్పటి వరకు పాలించిన పాలకులు బాగుపడ్డారు తప్ప పేదలు పేదలగానే మిగిలిపోయారన్నారు. బీఎస్పీ ద్వారా రాజ్యాధికారం సాధ్యమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. |

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్