టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు
నాతవరం మండలం సరుగుడు పంచాయతీకి చెందిన పలు కుటుంబాలు సోమవారం టీడీపీ నుంచి వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్ధి పెట్ల ఉమాశంకర్ గణేశ్ వారందరికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం గణేశ్ మాట్లాడుతూ. వైసీపీ అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో రూ. 30 వేల మెజార్టీతో గెలుస్తామన్నారు.