పాఠశాలను తనిఖీ చేసిన గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి

53చూసినవారు
పాఠశాలను తనిఖీ చేసిన గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి
పాడేరు మండలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కే. కన్నబాబు సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన చర్మ వ్యాధుల వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. చర్మ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు సబ్బులు, మందులు పంపిణీ చేశారు. 9వ తరగతి గదిని సందర్శించి, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. వంట గదులు, మరుగుదొడ్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్