అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం తింటుకూరు అటవీ ప్రాంతంలో ఓ మద్దిచెట్టు నుంచి నీరు ఉబికివస్తోంది. బేస్క్యాంప్ వద్ద జిల్లా అటవీ శాఖ అధికారితో పాటు సిబ్బంది ఫీల్డ్ వర్క్కు వెళ్లారు. ఈ నేపథ్యంలో 100 మద్ది చెట్లను గుర్తించారు. వాటిలో ఒక చెట్టుకు రంధ్రం చేయగా సుమారు 20 లీటర్ల వరకు నీరు వచ్చింది.