విశాఖ ఎండడా వైసిపి పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ సిబ్బంది అంటించిన నోటీసులను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చించివేశారు. శనివారం జీవీఎంసీ అధికారులు కార్యాలయానికి నోటీసులు అంటించగా. విషయం తెలుసుకుని వైసీపీ నేతలంతా పార్టీ కార్యాలయానికి చేరారు. వీఎంఆర్డీఏ అనుమతులతోనే వైసీపీ కార్యాలయం నిర్మించామని, కూటమి ప్రభుత్వం కక్ష కట్టి ఇలా ఇప్పుడు నోటీసులు అందజేయడం తగదని అమర్ పేర్కొన్నారు.