విశాఖ: వరద బాధితులకు విరాళం

75చూసినవారు
విశాఖ: వరద బాధితులకు విరాళం
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వలన నష్ట పోయిన వారికీ తమవంతు సహాయాన్ని అందించేందుకు విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం టీచర్స్ మ్యూచ్‌వల్లి ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ముందుకు వచ్చింది. తమవంతు బాధ్యతగా రూ. 1,04,000 చెక్కు రూపంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ. ఎన్. ధనుంజయ రావుకు శుక్రవారం అందించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చేరవేయాలని సొసైటీ ప్రతినిధులు కోరారు.

సంబంధిత పోస్ట్