అనాథ ఖైదీ శవానికి ‘యువసేవ’ అంత్య క్రియలు

53చూసినవారు
అనాథ ఖైదీ శవానికి ‘యువసేవ’ అంత్య క్రియలు
అనాథ మృతదేహానికి యువసేవా ఫౌండేషన్‌ అంత్యక్రియలు జరిపించి మన్ననలు పొందింది. ముంబయికి చెందిన ప్రభాస్‌ మిశ్రా (55) ఓ కేసులో అరెస్టయి, 2021 నుంచి విశాఖ సెంట్రల్‌ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు. అనారోగ్యంతో ప్రభాష్‌ మిశ్రా మంగళవారం మృతి చెందాడు. అయితే మృతుడు అనాథ అని తెలుసుకున్న యువ సేవా సంస్థ వ్యవస్థాపకుడు పీలా హరి ప్రసాద్‌ ఇక్కడి వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ బాబు, జైలు సిబ్బంది వర్మ, ప్రసన్నలతో కలిసి జ్ఞానాపురంలోని శ్మశాన వాటికలో మంగళవారం అంత్యక్రియలు జరిపించారు.

సంబంధిత పోస్ట్