ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ ఘటన జరిగింది. బీహార్కు చెందిన నితేష్ కుమార్ ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేయబోగా బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అటువైపు రాగా బాలికను గొంతు నులిమి చంపేసి పారిపోబోయాడు. పోలీసులు వచ్చి పట్టుకుబోగా ప్రతిఘటించాడు. దీంతో కాల్పులు జరపగా గాయపడి చనిపోయాడు.