59 నెలల వైసీపీ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని సీఎం జగన్ తెలిపారు. డీబీటీ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో వేశామని చెప్పారు. "ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తు. చంద్రబాబుకు ఓటేస్తే.. సంక్షేమ పథకాలకు ఇక ముగింపే. జగన్కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయి. ఎన్నికల తర్వాత బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తారు. ఎవరు కావాలో తేల్చుకోండి." అని సీఎం పిలుపునిచ్చారు.