గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం చేసిందని సీఎం జగన్ అన్నారు. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా ప్రజల అకౌంట్లలో వేశామని తెలిపారు. 130 సార్లు బటన్ నొక్కి.. నేరుగా పేదల ఖాతాల్లో డబ్బు జమ చేశామని చెప్పారు. ప్రజలు రెండుసార్లు బటన్ నొక్కి వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో జరిగిన 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.