'పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేశాం'

66చూసినవారు
'పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేశాం'
పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. విజయవాడలో ఆమె సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పురందేశ్వరి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్