2014 ఏడాది నుంచి 2019 వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఏం సంక్షేమం అందించిందో ప్రజల బ్యాంక్ అకౌంట్లు చూస్తే అర్ధమవుతుందని సీఎం జగన్ అన్నారు. ఏ ఒక్క రూపాయి అయినా సంక్షేమం ద్వారా అందించారా? అని వారినే ప్రశ్నించాలన్నారు. "2019 నుంచి 2024 వరకూ మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్మును చూడమనండి.. రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం." అని సంగివలస సభలో సీఎం పేర్కొన్నారు.