ప. గో జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో నామినేషన్ల అనంతరం 99 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించడం జరిగిందని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా భీమవరం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో నామినేషన్ల ఉపసంహరణలో 10 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా. మొత్తం 89 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని స్పష్టం చేశారు.